# Tags
#తెలంగాణ

నిజామాబాద్ మున్సిపల్ ఉద్యోగి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు, బంగారం!

నిజామాబాద్ :

మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం…

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై నిజామాబాద్ మున్సిపల్ రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.

భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం.

నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు.

ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు.

నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1,10,00000 గుర్తింపు.

6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తుల గుర్తింపు.

మొత్తం 6 కోట్ల 7 లక్షల విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ.