# Tags
#తెలంగాణ

శాంతియుత వాతావరణం లో పండగను జరుపుకోవాలి…ఎస్సై రమాకాంత్

  • వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం..
    ఎట్టి పరిస్థితుల్లో డీజే కు అనుమతి లేదు. శాంతియుత వాతావరణం లో పండగను జరుపుకోవాలి… (తెలంగాణ రిపోర్టర్, sampath p ):

రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి శివ గార్డెన్స్ లో సోమవారం రోజు ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో వినాయక పండుగను జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని నిమజ్జనం రోజున డీజే కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని, ఎవరైనా పోలీసుల విజ్ఞప్తిని ఉల్లంఘించినచో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , అన్ని మండపాల నిర్వాహకులు ఒకేరోజు నిమజ్జనం అయ్యేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.