# Tags
#తెలంగాణ

రాయికల్ లో బిజెపి శ్రేణుల సంబరాలు

రాయికల్ : S. Shyamsunder

భారతదేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద స్వీట్లను పంచి వేడుకలు నిర్వహించారు.

అనంతరం పాత బస్టాండ్ వద్ద బాణాసంచా పేల్చి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాయికల్ మండల ప్రధాన కార్యదర్శి తాజా మాజీ ఎంపిటిసి ఆకుల మహేష్, రాయికల్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోడుగం శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మచ్చ నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురుమ మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు తోగిటి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు కునారపు భూమేష్, కడార్ల శ్రీనివాస్, దళిత మోర్చా అధ్యక్షుడు బన్న సంజీవ్, కార్యదర్శి సామల సతీష్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి బండారి సాయిరాజ్ , కురుమ ప్రేమ్ రెడ్డి,బూత్ అధ్యక్షులు నరేందర్ , కంటే భూమేష్, దాసరి రాజు రవి కిరణ్, నాగరాజు, ఐటీ సెల్ కన్వీనర్ కిషోర్, చందా రమేష్, అల్లే నరసయ్య, తోకల శంకర్ కల్లెడ హరీష్, రాస మల్ల రాజు, ఆర్మూరు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *