కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత

శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల క్రీడా & సాంస్కృతిక దినోత్సవమును పురస్కరించుకుని కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో శనివారం, కళాశాలలోని ప్రధాన గ్రూప్ లలో ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు సుమారు 2.50 లక్షల విలువ గల నగదు పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ. అశోక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్, కాసుగంటి కుటుంబం ప్రతినిధి, వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్, ఇంటర్మీడియట్ జిల్లా విద్యా అధికారి నారాయణ, జిల్లా క్రీడాధికారి డా. రవికుమార్, కళాశాల పూర్వ విద్యార్ధి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు దాసరి నాగభూషణం, ఎం. శివరాం కృష్ణ, మల్లయ్య, ఎన్ సి సి కళాశాల అధికారి రాజు, అధ్యాపక బృందం సురేందర్, గోవర్ధన్, మరియు అధ్యాపకులు, మహిళా అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కార్యక్రమంకు విచ్చేసిన జస్టిస్ పుల్ల కార్తీక్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, కాసుగంటి కుటుంబం ప్రతినిధి, వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా, ఎన్ సి సి క్యాడట్స్ బృందంచే గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం సరస్వతి విగ్రహం వద్ద పూజ నిర్వహించారు.
ఈ సందర్బంగా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ మాట్లాడుతూ, ఈ కళాశాల పూర్వ విద్యార్ధిగా తాను ఈ కార్యక్రంలో పాల్గొనడం అదృష్టమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయనీ, విద్యాభివృద్ధికి సహకరిస్తున్న కాసుగంటి కుటుంబానికి, నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రతీ విద్యార్ధి కష్టపడి చదివితేనే వృద్ధిలోకి రాగలరన్నారు.
అలాగే తాను ఈ స్థాయికి రాగలిగానంటే అది అధ్యపాక బృందం కృషి అన్నారు.కాసుగంటి కుటుంబం అందిస్తున్న స్ఫూర్తితో తాను సైతం వచ్చే సంవత్సరం నుండి sknr జూనియర్, డిగ్రీ కళాశాలల ఉత్తమ విద్యార్థులకు తన తల్లితండ్రుల పేరిట గోల్డ్ మెడల్ ప్రధానం చేస్తానని ప్రకటించారు.
కాసుగంటి కుటుంబం ప్రతినిధి, వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల ప్రాంతంలో విద్యభివృద్ధికోసం పాటుపడడమే తమ కుటుంబం ప్రధాన ధ్యేయమన్నారు. కళాశాల అభివృద్ధికోసం తమ తాత గారైన కాసుగంటి నారాయణ రావు అందించిన సుమారు 32 ఎకరాల భూమి కాపాడడంతో పాటుగా అక్రమణకు గురికాకుండా కాపాడదంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అందిస్తున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలిపారు. కాసుగంటి కుటుంబం గత 8 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహం వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ విద్యార్థిలో చదువుతో పాటుగా, సామాజిక దృక్పథం అలవార్చుకోవాలని, ఈ పురస్కారాలకు సార్థకత తేవాలన్నారు.
అలాగే,శ్రీ కాసుగంటి కుటుంబం అందించే నగదు పురస్కారాలను sknr జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం వచ్చే సంవత్సరంనుండి అందిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు కాసుగంటి కుటుంబం అందజేసే నగదు పురస్కారాలలో ప్రతి విద్యార్థికి రూ. 40 వేల రూ.ల నగదు పురస్కారంతోపాటుగా మరో నలుగురు విద్యార్థులకు సైతం నగదు పురస్కారంలనుహైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్, కాసుగంటి కుటుంబం ప్రతినిధి, వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.