భారతదేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్..

కరీంనగర్
👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
👉 హాజరైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్
- అత్యంత పకడ్బందీగా వరి ధాన్యం కొనుగోలు.
- ఎప్పటికప్పుడు రైతులకు డబ్బుల చెల్లింపులు..
- అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం..
- అనర్హులకు అందిస్తే అధికారులపై చర్యలు తప్పవు..
- కరీంనగర్ ఉమ్మడి జిల్లా సర్వతముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
- ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి…..
- ఆధునిక పద్ధతుల ద్వారా మేజర్ ప్రాజెక్టు ల డి- సిల్టేషన్ ప్రక్రియ
- పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం
- 60 లక్షల ఎకరాలలో 130 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది
- గతం కంటే నాలుగు రెట్లు అధికంగా రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు
- వానాకాలం ముందస్తు సాగు రైతులను సన్నద్దం చేయాలి
- వానాకాలం పంట సాగుకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా పకడ్బందీగా వ్యవహరించాలి..
- ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు వానకాలం పంటల సాగు సన్నద్ధతపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా సమీక్ష..
- ఆయా అంశాలపై పూర్తి వివరాల సేకరణ..
- సమస్యల పరిష్కారానికి సూచనలు సలహాలు..
కరీంనగర్,
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాలేశ్వరం సుందిళ్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజీ లో నుంచి చుక్క నీరు రాకున్నా అధికారుల సహకారం ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యల వల్ల అత్యధికంగా వరి సాగైందని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
గురువారం ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్సింగ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య చిన్నమైలు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. భూభారతి వరి ధాన్యం కొనుగోళ్లపై దాదాపు నాలుగు గంటల పాటు మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపి లను భాగస్వామ్యం చేస్తామని అన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీ సిల్టేషన్ ఆధునిక పద్దతుల్లో పూర్తి చేసి పూర్వపు సామర్థ్యం తీసుకొని వస్తామని అన్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు తో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాలువలు, తూములు, ఓటి మరమ్మత్తు పనులు ఓ & పి క్రింద పూర్తి చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించి సాగునీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే ప్రతిపాదన రూపొందించాలని వాటికి సంబంధించిన నిధులు వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సాకారంతో ముందుకు వెళ్తానని ప్రకటించారు.
28 మే నాటికి యాసంగి పంట కొనుగోలు కోసం రైతులకు రాష్ట్రంలో దాదాపు 13 వేల కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ హయాంలో ఇదే సమయం 2023 సంవత్సరానికి 3 వేల 500 కోట్లు మాత్రమే చెల్లించారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రైతులకు మనం 2 వేల 782 కోట్ల చెల్లిస్తే 2023 లో 538 కోట్లు మాత్రమే చెల్లించారని అన్నారు.ప్రజా ప్రభుత్వం 28 మే నాటికి 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే , 2023 లో 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కోనుగోలు చేసిందని పేర్కొన్నారు.
సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తామని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. నీరు అందుబాటులో ఉండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు.
యాసంగి సీజన్ లో తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం సాగు జరగలేదన్నారు. దేశంలో వరి పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అన్నారు. ప్రాజెక్టులలో ఉన్న నీళ్లు సమర్ధవంతంగా వినియోగించడం వల్ల పెద్ద ఎత్తున పంటలు పండాయన్నారు. సాగునీటిని పొదుపు క్రమంగా వాడటం వల్లే పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు.
యాసంగి పంట సన్న రకాల వడ్లను బాయిల్డ్ రైస్ గా మార్చేందుకు ప్రభుత్వం రైస్ మిల్లులో ప్రతిపాదనలు ఆమోదిస్తుందని అన్నారు. ఈ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోను చర్చిస్తామని తెలిపారు. నీటి పారుదల శాఖ పరిధిలో 1100 ఇంజనీర్లు, 1800 మంది లష్కర్లను నియమించామని అన్నారు. సాగునీటిపారుదల శాఖను పూర్తిగా రక్షణ చేశామని తెలిపారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాగునీటి శాఖను సమగ్రంగా ప్రక్షాళన చేశామని స్పష్టం చేశారు. రోళ్ళ వాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా జగిత్యాల జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అందుకోసం అవసరమైన ఉన్నతాధికారులతో నిత్యం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తమ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరుతుందని పేర్కొన్నారు.
నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం,, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలు ఉండవని మంత్రి తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చెప్పారు. రాజకీయాలు అతీతంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కలెక్టర్లు మరో వారం రోజులపాటు కొనుగోలు పట్ల ప్రత్యేక శ్రద్ధ కొనసాగించాలని , జిల్లాలో అవసరమైన మేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా లారీలు కొరత లేకుండా చూసుకోవాలని, కొనుగోలులో జాప్యం జరగవద్దని లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వెంటవెంటనే మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. భారతదేశంలో మొదటి సారిగా రాష్ట్రంలోనే 84% జనాభాకు ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే విప్లవాత్మకమైన పథకమని సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. సన్న బియ్యం సరఫరా వల్ల రేషన్ అక్రమాలు గణనీయంగా తగ్గిపోతాయని, ప్రజలకు 100% ఆహార భద్రత లభిస్తుందని అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పథకం అమలు కావడంలేదని మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు అంశంలో జ్యుడీషియల్ కమిషన్ కు నాయకులు సహకరించాలని మంత్రి కోరారు. జ్యూడిషియల్ కమిషన్ నివేదిక ప్రకారం తప్పనిసరిగా చర్యలు ఉంటాయని అన్నారు. మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ దగ్గర అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తో చర్చించి త్వరలోనే పట్టాలు అందించే కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు.
ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాలన దక్షత కారణంగా దేశంలోనే అత్యధికంగా వరి పంట మన తెలంగాణ రాష్ట్రంలో సాగు జరిగిందని, అదే స్థాయిలో భారీ ఎత్తున కొనుగోలు కూడా చేశామని అన్నారు.
ఎన్.డి.ఎస్.ఏ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తామని అన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయల పరిహారం క్రింద 51 కోట్లు విడుదల చేశామని అన్నారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో పెట్టాలని అన్నారు.
భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పట్టాదారులను భయభ్రాంతులకు గురి చేసి గతంలో పేరు మారిన పట్టాలు సైతం అసలైన అర్హులకు చేరాలని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూ దార్ కార్డు సర్వే నెంబర్, యాజమాన్యం, విస్తరణ, బౌండరి వివరాలు ఉండేలా అందిస్తామని అన్నారు.
అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందాలని, పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరగాలని అన్నారు.
జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. ఆయా జిల్లాలో కలెక్టర్లు సమన్వయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల ఎంపికలో నిబంధనలు పాటించాలని అర్హులైన పేదలకు మాత్రమే లబ్ధి చేకూరేలా చూడాలని పేర్కొన్నారు. అనర్హులకు అందిస్తే మాత్రం అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి నిరంతరం జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో రైస్ మిల్లుల వద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులు గురయ్యారని , ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడ ఇబ్బంది రాలేదని అన్నారు. మలక్ పేట, సూరమ్మ, మోతే నారాయణ పూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టు పనులు వేగవంతం పూర్తి చేయాలని కోరారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోకి భూపాలపల్లి హనుమకొండ సిద్దిపేట జిల్లాలు వస్తాయని ఆయా జిల్లా కలెక్టర్లను సైతం ఉమ్మడి జిల్లా వారి సమీక్ష సమావేశాలకు అధికారులు ఆహ్వానించాలని పేర్కొన్నారు. కలెక్టర్లు రాకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదని కలెక్టర్లు వస్తే వాటిపై చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదని అన్నారు. మన ప్రభుత్వం నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను సానుకూలంగా ప్రజల లోకి తీసుకొని వెళ్లాలని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి, సన్న రకం ధాన్యం 500 రూపాయల బోనస్, రేషన్ కార్డు సన్న బియ్యం సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు వేయడం వంటి అనేక పథకాలు అమలు చేశామని అన్నారు. కరీంనగర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో వందల ఇండ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 3500 ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి కేటాయిస్తున్నదని తెలిపారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైస్ మిల్లుల దగ్గర ఎక్కడైనా ధాన్యం కోత విధిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పెండింగ్ ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భవిష్యత్తు లో మంజూరు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా ప్రజల్లో మంచి పేరు వచ్చిందని అన్నారు.
భూ భారతి సంబంధించి సమస్యల పరిష్కారం బాగా జరుగుతుందని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో 43 వేల 100 ఎకరాల పైగా ఆయకట్టుకు సాగు నీరు కలికోట సూరమ్మ ప్రాజెక్టు ద్వారా అందుతుందని, దీనికి ప్రభుత్వం 320 కోట్లు మంజూరు చేసిందని, భూ సేకరణ నిధులు వస్తే కుడి ఎడమ కాలువ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని అన్నారు.
వరద కాలువ పై 15 కోట్లతో క్రాస్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. కాళేశ్వరం ప్యాకేజ్ 9 కెనాల్ పనులు పూర్తి చేయాలని, ఎగువ మానేర్ వరకు ఈ నీళ్ళు అందించేందుకు 10 కోట్ల విడుదల చేయాల్సి ఉందని అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించిందని త్వరలో పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన వేములవాడ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. శృంగేరి పీఠం.. ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తుల ఇలవేల్పుగా నిలిచే రాజన్న ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ డీ -83 కాలువలు పూర్తి స్థాయిలో మీరు రావడం, రాముడు ఎత్తిపోతల పథకం పూర్తి కావడం వల్ల రామగుండం ప్రాంతంలో 40 వేల మెట్రిక్ టన్నుల కు పైగా పంట దిగుబడి వచ్చిందని అన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ జరిగిందని , సన్న రకం వడ్లకు బోనస్ అందడంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు చేశామని అన్నారు . పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సింగరేణి కి సంబంధించిన భూములు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. బండల వాగు ఎత్తిపోతల పథకం పూర్తయిందని, దీనిని అధికారికంగా ప్రారంభించాలని, అదేవిధంగా పాలకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటీ కేటాయింపులు చేసి పూర్తి చేయాలని, పత్తిపాక రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని కోరారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం వల్ల ఎలాంటి ప్రాంతం భూములకు సాగునీరు అందుతుందని, తద్వారా రైతులకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ గత పాలకుల హయాంలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం కట్టింగ్ తో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రజా ప్రభుత్వం పాలనలో ఎక్కడా కూడా కట్టింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గతంలో ప్రభుత్వం 2 లక్షల 36 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, నేడు 3 లక్షల 60 వేల పైగా మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసి 91 శాతం రైతులకు చెల్లింపులు పూర్తి చేశామని అన్నారు.
వర్షాకాలం పంట సంబంధించి పెద్దపల్లి జిల్లా రైతాంగానికి 114 కోట్ల సన్న వడ్ల బోనస్ చెల్లించడం జరిగిందని అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకుందని, రాబోయే 5 రోజుల లోపు కోనుగోలు పూర్తవుతుందని అన్నారు. సన్న రకం బియ్యం రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తున్నామని అన్నారు. డీ-83, డీ-86 , డీ-89, డీ-91 కాల్వలకు సాగు నీటి ఇబ్బంది పోవాలంటే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం జరగాలని అన్నారు. పెద్దపెల్లి జిల్లాలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒకవైపు రైతు రుణమాఫీ మరోవైపు రైతు భరోసా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ కావడం వల్ల జిల్లాలో రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యమిస్తుందని గతంలో ఏ ప్రభుత్వం ఇలా రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో ఉన్న కాల్వ, షెల్టర్ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అన్నారు. డిజైన్ సమస్య వల్ల దెబ్బతిన్న చెక్ డ్యాం మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అన్నారు. జగిత్యాల పరిధిలో ఉన్న లిప్ట్. పెండింగ్ బిల్లులు చెల్లింపు పూర్తి చేయాలని అన్నారు. రోళ్ళ వాగు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, అటవీ అనుమతులు త్వరగా అందేలా చొరవ చూపాలని ఆయన కోరారు.
జగిత్యాల పట్టణంలో మంజూరైన 4 వేల 500 ఇండ్లు పూర్తి చేశామని, వీటికి మౌలిక వసతులు కల్పన పనులు పూర్తి చేశామని అన్నారు. అసెస్మెంట్ పట్టాలు ఉన్న రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేసేలా చూడాలని అన్నారు. తాను చిన్న వయసులో ఉండగా గ్రామంలో ఇందిరమ్మండ్ల నిర్మాణం చూసానని నాడే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు బాటలు వేసిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సాగుతున్నదని పేర్కొన్నారు. పేదింటి కలను నెరవేర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని తెలిపారు.
చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల, రేషన్ కార్డు వంటి పథకాలు అర్హులకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. చోప్పదండి లో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తున్నామని అన్నారు. నారాయణ పురం రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తి చేశామని, భూ సేకరణ కోసం 23 కోట్లు, ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 20 విడుదల చేస్తే పనులు పూర్తవుతాయని అన్నారు. కొండగట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు 22 కోట్ల విడుదల చేయాలని కోరారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే కొండగట్టుతో పాటు మిగతా ఐదు గ్రామాలకు సాగునీటి సమస్య తీరుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో రైతులు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండగట్టు ఎత్తిపోతల పథకం పండ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలను రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సీజన్లో 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మూడు లక్షల 3500 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. దాదాపు 95 శాతం వరి ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యాయని, రెండు రోజుల్లో 100% పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో వరి ధాన్యం విక్రయించిన 47 వేల మంది రైతుల ఖాతాలో 671 కోట్లు డబ్బులు జమ చేశామని తెలిపారు. గత సీజన్లో 2,65,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈ సీజన్లో మూడు లక్షల 3500 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, గతంలో కంటే పెద్ద ఎత్తున వరి సాగు అయిందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై ప్రత్యేక దృష్టిసారించామని జిల్లాలో మొదటి ఫేసులో 2027 మంజురయ్యాయని 990 మార్కింగ్ చేశామని తెలిపారు. 380 గ్రౌండింగ్ పూర్తి చేశామని, 346 ఇండ్లకు పేమెంట్లు కూడా ఇచ్చామని తెలిపారు. సెకండ్ ఫేసులో 5785 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. జిల్లాలో 13 ఇందిరమ్మ మోడల్ హౌస్ ల నిర్మాణం చేపట్టామని, వీటిని జూన్ రెండున ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో యూరియా ఎరువులు విత్తనాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. రైతులు పంటల సాగు విషయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాకుండా ప్రత్యేకంగా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని అందుకోసం ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ కోసం 75 కోట్ల అవసరమని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి కలెక్టర్ తీసుకొచ్చారు. అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గం లోని నారాయణపూర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం 23 కోట్ల నిధులు అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరు అయితే భూసేకరం పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. రైతులకు పంటల సాగులో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. యూరియా ఎరువులు విత్తనాలు కొరత రాకుండా సంబంధిత అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నకిలీ ఎరువులు విత్తనాలు బహిరంగ మార్కెట్లోకి రాకుండా అధికారులతో కలిసి ప్రత్యేక నిజావిభాగం టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు ప్రణాళికలతో ఉన్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కూడా దాదాపు పూర్తయ్యాయని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై దృష్టి పెట్టామని తెలిపారు. విప్ ఆది శ్రీనివాసు సార్ చెప్పిన అంశం కలికోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 100 కోట్లు అవసరమవుతాయని తక్షణం 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తే భూసేకరణ పై దృష్టి పెడతామని తెలిపారు. మంత్రి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేములవాడ నియోజక వర్గంలో పూర్తిస్థాయిలో సాగునీటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రబీ సీజన్ లో 242 కోనుగోలు కేంద్రాల ప్రారంభించి 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని గత సంవత్సరం కంటే ఇప్పటికే 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించామన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఉన్న రవాణా సమస్య పరిష్కరించామన్నారు. 150 కొనుగోలు కేంద్రాల్లో 100 శాతం కొనుగోలు పూర్తి చేసి మూసి వేసామని మరో మూడు రోజుల్లో పెండింగ్ కొనుగోలు కేంద్రాల కొనుగోలు పూర్తవుతుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 7 వేల 800 ఇందిరమ్మ మంజూరు చేసామని , రాష్ట్రం లోనే ఇండ్ల మంజూరులో ప్రథమ స్థానంలో సిరిసిల్ల జిల్లా ఉందని అన్నారు. రుద్రంగి మండలంలో పైరేట్ ప్రాజెక్టు కింద భూ భారతి ద్వారా 1200 భూ సమస్యలు స్వీకరించామని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాబోయే వానాకాలం పంటలు ఎరువులు విత్తనాల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని, నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝ, సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ వివిధ శాఖల ఉన్నతాధికారులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.