# Tags
#తెలంగాణ #హైదరాబాద్

డా.భూంరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ :

సీనియర్ వైద్యులు కరీంనగర్ కు చెందిన డా.భూంరెడ్డి మరణం తీరని లోటని, వైద్య వృత్తితో పాటు సామాజిక సేవకై వారి జీవితం మొత్తం అవిరళ కృషి చేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

వారు ఎంఎస్ చదువుతున్న రోజుల్లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో గోల్డ్ మెడలిస్ట్ పట్టా అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా అందుకొని ఆరోజుల్లో అనారోగ్య కారణాలతో జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చేరిన సమయంలో డా.భూంరెడ్డిని స్వయంగా పిలిపించుకుని వైద్య సేవలు పొందడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.

మా తండ్రి శ్రీపాద రావుకు కూడా మంచి మిత్రులని అన్నారు.వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

వారి కుమారుడు సూర్య నారాయణ రెడ్డి ని కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.