# Tags

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి : మున్సిపల్ మేనేజర్ వెంకట్ 

రాయికల్ : ఎస్ శ్యామ్ సుందర్


ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ మేనేజర్ వెంకట్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 1 వార్డులలో నిరుపేద కుటుంబానికి చెందిన భారతం దేవమ్మ ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ కు పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ బి.వెంకటి,హౌసింగ్ ఎ.ఇ పి. తిరుమల,మున్సిపల్ సిబ్బంది రజాక్,గంగారెడ్డి, శేఖర్ నరేష్ వార్డు కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ మొహమ్మద్ షాకీర్ బొద్దుల శివ కుమార్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.