# Tags
#తెలంగాణ

మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేస్తే చర్యలు :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ప్రజలెవరూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేయరాదు, ఫార్వర్డ్ చేయరాదు:
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మొదలైన వాటిలో మతవిద్వేషాలకు సంబంధించిన ఫేక్ మెసేజ్ లు వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్ లు చేయడం,ఫార్వార్డ్ చేయవద్దని, ఒకవేళ ఎవరైనా ఇట్టి ఆదేశాలను ఉల్లంఘించి ఫార్వార్డ్ చేసినా, పోస్ట్ చేసినా… వారితో పాటుగా గ్రూప్ ఆడ్మిన్ లపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయిని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరు ఎలాంటి ఉద్వేగాలకు లోనూ కాకుండా సంయమనం పాటిస్తూ శాంతి భద్రతల సంరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని తెలిపారు.