# Tags
#తెలంగాణ

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులకు ఉపాధి ఉద్యోగ కల్పనతో పాటు నిరుద్యోగ నిర్మూలనకై రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు… ఆదివారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత యాప్ ను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. “అల్ఫోర్స్ VNR E- క్లాసెస్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాల సంతోషంగా ఉందని,నరేందర్ రెడ్డి తనకు చాలా అప్తులని,భవిష్యత్తులో ఉచిత కోచింగ్ క్లాసులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని వారు ప్రకటించడం పట్ల అభినందిస్తున్నామని అన్నారు. విద్యాదానం గొప్పదని, మనం చదివే విద్య అనేది ఎప్పుడూ వృథాగా పోదు అని,అది ఎక్కడో ఏదో సమయంలో ఉపయోగపడుతుందని,ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి ఐతే వారి విధానాల ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని దానికి ఉదాహరణగా మంత్రి శ్రీధర్ బాబు ని చెప్పవచ్చని,కాబట్టి విద్య విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం తగదని,రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

పట్టభద్రుల ఎAమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఈ యాప్ ను అంకితమిస్తున్నానని పేర్కొన్నారు.. ఈ ప్రత్యేక యాప్ లో స్టడీ మెటీరియల్ వీడియో లెసన్స్ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్లు 6 నెలల పాటు ఉచితంగా అందజేస్తామని అన్నారు… ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఉమ్మడి నాలుగు జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంలో ఉచిత కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు… తాను నెలకొల్పిన విద్యాసంస్థలలో 5 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నానని అన్నారు…ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్