# Tags

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్,sampath panja): జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గురుకుల వసతి గృహం,పెద్దూర్ లోని మహాత్మా జ్యోతి భాపూలే వసతి గృహాలు, సిరిసిల్ల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహం, తంగళ్ళపల్లిలోని మైనార్టీ బాలికల హాస్టల్, బద్దెనపల్లి, నేరెళ్లలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాలయానికి కలెక్టర్ చేరుకొని ముందుగా ఆయా […]

📅 చరిత్రలో ఈరోజు – జూలై 3ఈరోజు చరిత్ర – సంఘటనలు, జననాలు, మరణాలు, దినోత్సవాలు. 🏛️ చారిత్రక సంఘటనలు 🔭 1608 – ఆప్టిక్స్ శాస్త్రవేత్త హాన్స్ లిపర్సే తొలిసారిగా టెలిస్కోప్‌ను రూపొందించాడు. 🚢 1767 – నావికుడు రాబర్ట్ పిట్కేర్న్, తన పేరుతో పిట్కేర్న్ దీవిని కనుగొన్నాడు. 📰 1767 – నార్వేలో ఆడ్రెస్సీవిసెన్ అనే వార్తాపత్రికను ప్రారంభించారు – ఇది నేటికీ ముద్రణలో ఉంది. 🏦 1819 – న్యూయార్క్లో ‘The Bank […]

ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు – ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ…

రాజన్న సిరిసిల్ల జిల్లా..(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తో సహా ఎల్లారెడ్డిపేట మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రదీప్ కుమార్, రఘు, బాబు పలువురు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్న తీరు పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు ఎంబిబిఎస్ డాక్టర్లు, జనరల్ మెడిసిన్ డాక్టర్, పిల్లల వైద్య నిపుణులు, వీరితో […]

వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా ప్రారంభమైన రుద్ర సహిత శతచండీ యాగము

హైదరాబాద్: హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో బుధవారం మల్లాపూర్,హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లో రుద్ర సహిత శతచండీ యాగమును వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ  కార్యక్రమంలో హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి కార్యవర్గం,సభ్యులు, వివిధ ప్రాంతాలనుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 6 వరకు రుద్ర సహిత శతచండీ యాగమును వైదికంగా, వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా కొనసాగుతుందని, ప్రతిరోజు పూజా […]

వెల్గటూర్ మండల ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన జక్కుల శ్రీనివాస్

వెల్గటూర్ మండల ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన జక్కుల శ్రీనివాస్ ఇప్పటికే ఎంపీవో గా మండలానికి విశిష్ట సేవలందించిన జక్కుల శ్రీనివాస్ Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant […]

త్రిశక్తి మాత ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిరహిస్తున్నారు. ఇందులో భాగంగా వారాహి మాత కు మంగళవారం రాత్రి లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో 9 రోజులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని ఈ వారాహి దేవిని పూజిస్తే భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. నవరాత్రులు జూన్ 26 నుండి […]

స్టైపెండ్ ‌సొమ్ము కోసం చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ హౌస్ సర్జన్ విద్యార్థుల నిరసన 

కరీంనగర్: చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ యాజమాన్యం మెడికో ఇంటర్న్‌లకు (హౌస్ సర్జన్ విద్యార్థులకు) గత రెండు నెలలుగా స్టైపెండ్ ‌సొమ్ము చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం11 గంటలనుండి అకస్మాతుగా కళాశాల ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఇంటర్న్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అన్ని OPDలు, వార్డువర్క్ మరియు వివిధ వైద్య సేవలను నిలిపి వేశారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యంకు ఒక వినతి పత్రం అందజేశారు. చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంటర్న్‌లమైన తాము, […]

జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి: TUWJ H-143 రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా): నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని (టియుడబ్ల్యూజే హెచ్ 143 ) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా కోరారు. ఈ మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ను కలిసి వినతి పత్రం […]

మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని : * 4 మండలాల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి శివ కిరణ్ గార్డెన్స్ లో 4 మండలాల అధికారులతో అభివృద్ధి పనుల పై సమీక్ష […]

ఎల్లారెడ్డి పేట నూతన SI గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు

ఎల్లారెడ్డి పేట : పంజా సంపత్ కుమార్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సై గా బాధ్యతలు తీసుకున్న కొమ్మిడి రాహుల్ రెడ్డి ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా  ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు పంజా సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై రాహుల్ రెడ్డి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ సభ్యులు అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ ఉపాధ్యక్షులు ఇమ్మడి […]