# Tags

విశేష ప్రతిభ కనబరిచిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న 22 మంది రియల్ హీరోస్ కు Zee అవార్డ్స్ బహుకరణలో ముఖ్యమంత్రి

తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నందునే ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న 22 మంది రియల్ హీరోస్ కు (పోలీసు) జీ తెలుగు సంస్థ (Zee Awards- 2025) అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఏ దేశం, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయో ఆ ప్రాంతాలు అభివృద్ధి పథంవైపు నడుస్తాయని, తెలంగాణ ప్రశాంతంగా ఉండటానికి […]

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేదు – అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేస్తే చర్యలు:మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు..ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే అర్హులుగా ఎంపిక చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు చొప్పున లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, ఎవరైనా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు వస్తె తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం జరిగి అనర్హులను ఎంపిక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల […]

జగిత్యాల జిల్లానుండి వ్యవసాయ మహిళా కళాశాల తరలిపోతుందా? ప్రజాప్రతినిధులు సంఘటితం కాకుంటే తప్పదా? 

జగిత్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు అన్ని జిల్లాల్లో విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు గతంలో మంజూరై, రెండు సంవత్సరాలుగా కోరుట్లలో నడుస్తున్న వ్యవసాయ మహిళా కళాశాల తరలిపోతుందన్న ఆందోళన జిల్లాలోని విద్యావంతుల్లో, తల్లిదండ్రుల్లో,  నెలకొని ప్రధాన సమస్యగా మారింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ తమ శాఖ తరపున వ్యవసాయ మహిళా కళాశాలను మంజూరు గావించారు. అయితే […]

ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎండలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కోరారు. ఎండలు, వడగాలులతో జరిగే ప్రమాదాలు పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని, అకాల వర్షాలు వల్ల భూమి నుండి వేడి వస్తుందని, ఎండ తీవ్రత కూడా అధికంగా […]

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి

शंकरं शंकराचार्यं केशवं बादरायणम् ।सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥ శివుడు, శివుని గురువు, కేశవుడు, బాదరాయణుడు.సూత్రాలను వివరించిన ఇద్దరు ప్రభువులకు నేను పదే పదే నా ప్రణామాలు అర్పిస్తున్నాను. జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల జయంతి మహోత్సవాలు చతురామ్నాయ – సర్వజ్ఞ పీఠాలు, దేశ విదేశాలలోని దేవాలయాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు, శక్తి పీఠాలు, తీర్థాలు, కోట్ల మంది భక్తుల గృహాలు, సభలలో వాడవాడలా మహోన్నత వైభముతో జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ తెలిపారు. “మూర్తి […]

యాదాద్రి జిల్లా కలెక్టర్ దత్తత విద్యార్థి భరత్ చంద్రచారికి 73% మార్కులు – పేరు నిలబెట్టావని అభినందించిన కలెక్టర్ హనుమంతరావు  

యాదాద్రి జిల్లా : ఆయన ఆలోచనలు విభిన్నం, ఆచరణాలు ఉన్నతం, సాధారణ ఉద్యోగం చేసినా, రెవిన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వర్తించినా, పంచాయత్ రాజ్, దేవాదాయ, సమాచార శాఖ కమిషనర్ గా ఏ ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నా తన బాధ్యతలను సక్రమంగా, నిక్కచ్చిగా నిర్వర్తిస్తూ, ప్రభుత్వపరంగా ప్రజలకు, సమాజానికి తన సేవలు అందించాలన్నదే ఆయన దృక్పథం.  ఈనేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా మంత్రిప్రగడ హనుమంతరావు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా, అన్ని రంగాల్లో  ముఖ్యమంత్రి ఆలోచనలకు […]

సింహాద్రి అప్పన్న చందనోత్సవం…చందనోత్సవంలో అపశ్రుతి

సింహాచలం: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు సహాయక […]

ఆత్మ త్యాగానికైనా వెనకాడబోను : బిజెపిజిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం పేరుతో ఆలయంలో ఉన్నటువంటి ఏ ఒక్క విగ్రహాన్ని తొలగించినా, తాను ఆత్మ త్యాగానికైనా వెనకాడబోనని జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజన్నకు చేసేటటువంటి పూజా కార్యక్రమాలు భీమన్న ఆలయంలో ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాను అభివృద్ధికి అడ్డుపడట్లేదని, […]

హిరోషిమాలో ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ ఆలపించిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు

జపాన్ దేశం హిరోషిమా నగరంలోని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఇద్దరు తెలుగు అమ్మాయిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎదుట తెలంగాణ అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ ఆలపించడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, హిరోషిమా లెజిస్లేచర్ ప్రతినిధిలతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించడానికి వెళ్లిన సమయంలో హర్షిణి (8 వ తరగతి), హరిణి (7 వ […]

జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు

జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) గారితో సమావేశమై పలు అంశాలను చర్చించింది. పర్యావరణ సాంకేతికత, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించారు. […]