# Tags

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకం- ముందుకొచ్చిన అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా, అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ (WE HUB – Women Entrepreneurs Hub)లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు – WE HUB సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు […]

హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్-దాదాపు 15 వేల మందికి ఉద్యోగవకాశాలు

ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భేటీలో ఈ మేరకు […]

దక్షిణ కొరియా పర్యటనపై ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీక్ష 

హైదరాబాద్ : -రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలకు అవకాశం -ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 11 వరకు జరగనున్న అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు సంబంధించి సమావేశాలు, కార్యక్రమాల ప్రణాళికను ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం సచివాయంలో సమీక్షించారు.  ఈ పర్యటనకు సిఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఒక […]

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా…పోస్టర్ ఆవిష్కరించిన సిఎం

జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం (World Day against Trafficking in Persons) సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ వారు రూపొందించిన పోస్టర్ ను మహిళా శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి సీతక్క తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రజ్వల ఫౌండేషన్ వారికి ప్రజాప్రభుత్వం […]

చిగురుమామిడి మండలం సీతారాంపూర్ స్టేజి సమీపంలో నేలకొరిగిన భారీవృక్షం

కరీంనగర్ : (ముడికె కనకయ్య): చిగురుమామిడి మండలం సీతారాంపూర్ స్టేజి సమీపంలో సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ కు వెళ్లే రహదారిపై భారీవృక్షం నేలకొరిగింది. గత రెండు రోజుల క్రితం వర్షాలకి బాగా నాని రోడ్డుపైన పడిపోయినది. సంఘటన స్థానంలో ఈ రహదారి పై వాహనదారులు ఎవరు రాకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీ వృక్షం రోడ్ పై పడిపోవడంతో హుస్నాబాద్ కరీంనగర్ నుండి వచ్చే వాహనాలకి చాలా ఇబ్బందికరంగా […]

కవి, రచయిత బండారి అంకయ్య గౌడ్ అస్తమయం

బండారి అంకయ్య అనేక కళలలో ప్రవేశమే కాదు, ప్రావీణ్యత గూడా ఉన్నవారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, నటులుగా, దర్శకులుగా, వ్యవహారకర్తగా, సమర్థులైన డిప్యూటీ కలెక్టర్ గా తెలుగు నేలలో భిన్న ప్రాంతాల వారికి సుపరిచితులు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ‘ప్రజలే ప్రభువులు’ నినాదంతో డా॥జయప్రకాశ్ నారాయణ ప్రారంభించిన ‘లోక్ సత్తా’ ఉద్యమంలో చేరి అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రజలకు సన్నిహితులైనారు. ‘లోక్ సత్తా’ రాష్ట్ర కార్యదర్శిగా దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థానిక, మహిళా సాధికారత సదస్సులు […]

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి పతకం-షూటింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన మనూ భాకర్

ఎవరీ మను భకర్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ భాకర్ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపాల్. మను చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. […]

నిరుపేద కుటుంబానికి జిల్లా మున్నూరుకాపు సంఘంతో కలిసి ఆర్థికసాయం అందజేసిన జడ్పీ మాజీ చైర్ పర్సన్

నిరుపేద కుటుంబానికి జిల్లా మున్నూరుకాపు సంఘం సభ్యులతో కలిసి ఆర్థిక సాయం అందజేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ 6వ వార్డ్ కు చెందిన పడాల రాజేష్ మరణించగా వారి భార్య పడాల నితిష మరియు ఇద్దరి పిల్లలకు జిల్లా మరియు సంఘం వారితో కలిసి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ఆర్థిక సాయం అందజేశారు. ఇలాంటి […]

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో హాస్టల్ లను పరిశీలించిన ఎంపిఓ బృందం

వెల్గటూర్ :(జగిత్యాల జిల్లా): TSMS- బాలికల హాస్టల్, కుమ్మరిపల్లి వార్డెన్ శ్రీమతి సునీత మరియు ANM, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ తో కలిసి వెల్గటూర్ మండల పంచాయతీ అధికారి జక్కుల శ్రీనివాస్ పరిశీలించారు. 100 మంది విద్యార్థులతో ఉన్న ఈ హాస్టల్ లోని సౌకర్యాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో ఆదివారం ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు TSMS- బాలికల హాస్టల్, కుమ్మరిపల్లితో పాటు ఎండపల్లి ఎస్ సి […]

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు-అన్ని రూపాల్లో నిరసన : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారుఅన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు, కక్ష పూరితంగా వ్యవహరించారు, బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో […]