# Tags

రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు * గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు త్వరలో పరస్పర అవగాహన ఒప్పందం * దాదాపు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు హైదరాబాద్:  ఆతిథ్య రంగంలో ప్రసిద్ధి చెందిన ‘మారియట్ ఇంటర్నేషనల్’ సంస్థ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో తమ ‘అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్-జీసీసీ)’ను నెలకొల్పనుంది. రూ.300-400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో […]

అమ్మేగా కనగలదు.. అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు!

ఎందరో అమ్మల నిజమైన కథ..!!! (SOURCE: From:(facebook of బాబు బంగారం) కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు……. మూడు నాలుగు రోజుల తరువాత అడిగా..అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.ముగ్గురు అమ్మాయిలు అండి, పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు. […]

తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యంకై సిఎం కీలక నిర్ణయాలు

తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా లభించేలా స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు. స్కిల్ వర్సిటీ ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి అంశాలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో చర్చించాలని అధికారులకు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని […]

ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు కందుల దుర్గేష్‌, సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. […]

తెలంగాణ‌లో క్రికెట్‌కు నయా జోష్‌!

తెలంగాణ‌లో క్రికెట్‌కు నయా జోష్‌… హైద‌రాబాద్‌: బీసీసీఐ స‌హ‌కారంతో రాష్ట్రంలో క్రికెట్ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) కొన్ని విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ఆదివారం జ‌రిగిన అపెక్స్‌ కౌన్సిల్ స‌మావేశంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు, కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్‌, కోశాధికారి సీజే శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్ సునిల్ అగ‌ర్వాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ… తెలంగాణ క్రికెటర్ల శ్రేయ‌స్సు, ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ క్రికెట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌గా మాజీ పేస‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్‌ను […]

భారత జట్టుకు భారీ నజరానా…రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా

భారత జట్టుకు భారీ నజరానా…రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పై విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా భారీ నజరానాగా ప్రకటించారు. టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని ట్వీట్ చేశారు. 17 సం. తర్వాత అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు , సహాయక సిబ్బందికి […]

డాక్టర్ శ్రీధర్ కస్తూరి గుండె చప్పుడు నుంచి జాలువారిన అక్షరమాలికకు శ్రీ లక్ష్మీ నారసింహుడి వద్ద పూజ…

డాక్టర్ శ్రీధర్ కస్తూరి గుండె చప్పుడు నుంచి జాలువారిన అక్షరమాలిక… ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో కస్తూరి అక్షరమాలికకు పూజలు ఆయన ప్రపంచ గుండె వైద్య  ప్రముఖ నిపుణులలో ఒకరు. తెలుగు రాష్ట్రాలలో ఆయన గుండె వైద్యం, పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.   నేటి ఆధునిక సమాజంలో ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల భవిష్యత్తులో రానున్న గుండె సంబంధిత సమస్యలు, వ్యాధులు, కోవిడ్ అనంతరం వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, క్లిష్టమైన శస్త్ర చికిత్సలు, […]

‘మెగాస్టార్’ తో మన “లీడర్”

‘మెగాస్టార్’ తో మన “లీడర్“ –చిరంజీవిని కలిసిన బండి సంజయ్ –సంజయ్ ను సాదరంగా ఆహ్వానించిన చిరు –ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించిన చిరంజీవి –సంజయ్ ఎంతో కష్టపడ్డారు,మీకు తగిన పదవి లభించిందన్న చిరు –విద్యార్ధి దశలో మీ సినిమాలకు నేను వీరాభిమానిన్న బండి సంజయ్ –ఇరువురి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలపై అరగంటకుపైగా చర్చ –చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉందన్న బండి సంజయ్ –మర్యాదపూర్వకంగానే కలిశానన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ […]

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలు:రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

HYDERABAD తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలు సాగాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ యేడాది బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 20 కోట్లను మంజూరు చేశారని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. బోనాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో మంత్రి […]

బొగ్గు గనుల వేలంపై..సీఎం రేవంత్​ రెడ్డి సూటిగా, ఘాటుగా!

బొగ్గు గనుల వేలంపై గత ప్రభుత్వం నిర్వాకాన్ని ఎండగడుతూసీఎం రేవంత్​ రెడ్డి సూటిగా, ఘాటుగా ఎక్స్​లో స్పందించారు. కేటీఆర్ గారూ, పదేండ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను మీరు పట్టించుకోలేదు. కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదు. మీరు ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదు. అయినప్పటికీ.. మీలో మార్పు రావాలని కోరుకుంటూ.. ఈ వాస్తవాలను మరోమారు తెలియజేస్తున్నాం. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience […]