# Tags

నిత్యా కమ్యూనికేషన్స్‌లో ఫెస్టివల్ లక్కీ డ్రా – 5G స్మార్ట్‌ ఫోన్‌ను గెలుచుకున్న వినియోగదారుడు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిత్య కమ్యూనికేషన్స్‌లో ఫెస్టివల్ లక్కీ డ్రా – OPPO A59 5G స్మార్ట్‌ ఫోన్‌ను గెలుచుకున్న వినియోగదారుడు -కస్టమర్ జి మహేష్‌కి స్మార్ట్‌ఫోన్‌ను అందించిననిత్యా కమ్యూనికేషన్స్ యజమాని గుండా రాజేందర్ జగిత్యాల ఉగాది మరియు ఈద్ శుభ సందర్భంగా, పట్టణంలోని నిత్యా కమ్యూనికేషన్స్, మొబైల్ షాప్ లో అద్భుతమైన పండుగ ఆఫర్‌ల ద్వారా ఒక కస్టమర్‌ ను అదృష్టం వరించి…ఆనందాన్ని అందించింది. నిత్యా కమ్యూనికేషన్స్ లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన మల్యాల మండలం […]

సమాజ హితాన్ని కోరేది కవులు: పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి. శ్యాంప్రసాద్ లాల్ సమైక్య సాహితీ- లయన్స్ జిల్లా 320 కరీంనగర్ వారి ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం శ్రీనిధి చిట్ ఫండ్ హాల్ లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి. శ్యాంప్రసాద్ లాల్ ముఖ్య అతిధిగా పాల్గొని, కరీంనగరుకు చెందిన సముద్రాల వంశీ మోహనాచార్యులు రచించిన దృక్ సిద్ధాంత పంచాంగంను ఆవిష్కరించారు. అదనపు కలెక్టరు […]

వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో సోమవారం బొమ్మకల్ రోడ్ లోని సిద్ధార్థ హై స్కూల్లో ఉచిత దంత వైద్య శిబిరము నిర్వహించారు. దాదాపు 200 మంది విద్యార్థులకు మరియు సిబ్బందికి దంత పరీక్షలు నిర్వహించి తగు సూచనలు సలహాలు మరియు వారికి టూత్ పేస్టులు మౌత్ వాష్ లు అందించారు .ఈ శిబిరంలో శరణ్య దంత వైద్యశాల డాక్టర్లు డాక్టర్ సౌమ్య మరియు డాక్టర్ సందీప్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జంద్యం మాధవి, […]

క్రోధి నామ సంవత్సర పంచాంగమును ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది. అందుకే ఆరోజు నుంచి కొత్త ఉగాది వేడుకలను నిర్వహించుకుంటాం. ఈసారి తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరు.ఈ నేపథ్యంలో…క్రోధి నామ సంవత్సర పంచాంగమును రాష్ట్ర ఐటి, సాంకేతిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మంథని నియోజకవర్గం కేంద్రంలో న్యాయవాది శశిభూషణ్ కాచె ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరణ గావించారు. బ్రహ్మశ్రీ గాడిచెర్ల నారాయణ […]

శ్రీ క్రోధి సంవత్సరంలో తెలంగాణలో రాజకీయంగా కొన్ని మార్పులకు అవకాశం-ప్రముఖజ్యోతిష్య పండితులు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ (ధర్మపురి)

ఉగాది శుభాకాంక్షలతో….. జగిత్యాల జిల్లా :  -కేంద్రం నుంచి కూడా సరైన విధంగా ఆర్థిక సహాయం లభించడంతో ఆర్థిక సమస్యల నుంచి రాష్ట్రం బయట పడగలుగుతుందంటున్న సంతోష్ కుమార్ శర్మ శ్రీ క్రోధి సంవత్సరం ఉగాది రోజున రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ పట్టణానికి సూర్యోదయ కాలానికి గణించబడిన జాతకాన్ని పరిశీలిస్తే….ఈ సంవత్సరం రాష్ట్రంలో రాజకీయంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తుందని ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఓం సాయి జ్యోతిష్యాలయ […]

చేనేత సమస్యలపై సి.ఎం సానుకూల స్పందన :చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వహణ మహిళావిభాగం అధ్యక్షురాలు చిందం సునీత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చేనేత సమస్యలను తెలుపుతూ, ప్రభుత్వం  చేనేత పని వారికి తగిన సహాయ సహకారాలు, ప్రభుత్వ రుణాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి కి ఆదివారం హైదరాబాద్ లో కలిసి ఒక వినతి పత్రం అందజేయడం జరిగిందని చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కార్యనిర్వహణ మహిళావిభాగం అధ్యక్షురాలు చిందం సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ విజ్ఞప్తికి సానుకాలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో […]

జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అటవీశాఖ ఉద్యోగులు, టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

జగిత్యాల జగిత్యాల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది మరియు టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు తో పాటు ఎఫ్ఆర్ఓ ప్రణీత్ కౌర్, డిఆర్ఓ అరుణ్ కుమార్, బీట్ ఆఫీసర్ మహమ్మద్ ఫిరోజ్ అలీ, అటవీశాఖ ఉద్యోగులు, అటవీశాఖ ఉద్యోగ సంఘ నాయకులతో పాటు టింబర్ అసోసియేషన్ సంఘ నాయకులు, పలువురు ముస్లిం […]

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం!

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. source:( facebook friend: mosalikanti venkataramanarao ): అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ […]

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఆనంద నిలయంలో ఇఫ్తార్ విందు 

జగిత్యాల జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఆనంద నిలయంలో గురువారం రాత్రి ఇఫ్తార్ విందు పేరిట విద్యార్థినిలకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ బాషా పాటు జిల్లా అదన కలెక్టర్లు టిఎస్ దివాకర రాంబాబు తో పాటు జిల్లా అధికారులు రాజ్ కుమార్ సాయిబాబా ఇతర అధికారులు మరియు రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడు ఎండి. వకీల్, […]

ఈవిఎం, వివిప్యాట్ ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి:జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల ఈవిఎం, వివిప్యాట్ ల మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. బుధవారం రోజున IDOC లోని కాన్ఫరెన్స్ హాలులో సహాయ రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఈవీఎం, వివి ప్యాట్ ల మొదటి ర్యాడమైజేషన్ నిర్వహించారు. రానున్న లోకసభ ఎన్నికల దృష్ట్యా ఎలక్ట్రానిక్ యంత్రాలు, వివిప్యాట్ లను జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాలకు కేటాయించినట్లు తెలిపారు. కోరుట్ల నియోజక వర్గానికి […]