# Tags

స్టైపెండ్ ‌సొమ్ము కోసం చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ హౌస్ సర్జన్ విద్యార్థుల నిరసన 

కరీంనగర్: చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ యాజమాన్యం మెడికో ఇంటర్న్‌లకు (హౌస్ సర్జన్ విద్యార్థులకు) గత రెండు నెలలుగా స్టైపెండ్ ‌సొమ్ము చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం11 గంటలనుండి అకస్మాతుగా కళాశాల ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఇంటర్న్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అన్ని OPDలు, వార్డువర్క్ మరియు వివిధ వైద్య సేవలను నిలిపి వేశారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యంకు ఒక వినతి పత్రం అందజేశారు. చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంటర్న్‌లమైన తాము, […]

జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి: TUWJ H-143 రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా): నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని (టియుడబ్ల్యూజే హెచ్ 143 ) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా కోరారు. ఈ మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ను కలిసి వినతి పత్రం […]

మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని : * 4 మండలాల అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు మంథని సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి శివ కిరణ్ గార్డెన్స్ లో 4 మండలాల అధికారులతో అభివృద్ధి పనుల పై సమీక్ష […]

ఎల్లారెడ్డి పేట నూతన SI గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు

ఎల్లారెడ్డి పేట : పంజా సంపత్ కుమార్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సై గా బాధ్యతలు తీసుకున్న కొమ్మిడి రాహుల్ రెడ్డి ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా  ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు పంజా సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై రాహుల్ రెడ్డి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ సభ్యులు అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ ఉపాధ్యక్షులు ఇమ్మడి […]

తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు పీ.వీ నరసింహా రావుకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఘన నివాళులు

మంథని : తొలి తెలుగు ప్రధాని,బహుభాషా కోవిదుడు,ఆర్థిక సంస్కరణల ఆద్యుడు,తెలంగాణ ముద్దు బిడ్డ..పీ.వీ నరసింహా రావు జయంతి సందర్భంగా.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆ మహానీయుని చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. […]

మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి :రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని : మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ […]

వికలాంగుల జీవితాలను మార్చడానికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి హెలెన్ కెల్లార్ :మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : హెలెన్ కెల్లార్ 145 జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మలక్ పేట నల్గొండ x రోడ్ వద్దగల దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జండర్ వ్యక్తుల సాధికారత శాఖ వారి ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెలెన్ కెల్లార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు,అనంతరం పాఠశాల […]

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ లో 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు కమిటీ ఆమోదం

హైదరాబాద్,   నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం 4వ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం లో జరిగింది. కమిటీ సమావేశంలో 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు.  ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా,  డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, బాత జబీన్, […]

వచ్చే నెల 2 నుండి 6 వ తేదీ వరకు హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లోరుద్ర సహిత శతచండీ యాగము

రుద్ర సహిత శతచండీ యాగము కరపత్రం, ఆహ్వానపత్రికను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించిన వేదపండితులు నంబి వేణుగోపాలచార్యులు హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో వచ్చే నెల 2 నుండి 6 వ తేదీ వరకు మల్లాపూర్,హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లోరుద్ర సహిత శతచండీ యాగము నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఈ  కార్యక్రమంకు సంబంధించిన కరపత్రం, ఆహ్వానపత్రికను జిల్లా కేంద్రంలోని వాసుదేవసదన్ లో గురువారం మధ్యాహ్నం 4 గంటలప్రాంతంలో వేద పండితులు నంబి వేణుగోపాలచార్యులు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మహా […]

సమాజ అభివృద్ధికి మార్గదర్శకులు పాత్రికేయులు : లయన్స్ క్లబ్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు

రాయికల్ : (S.Shyamsunder) ప్రజలకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలకు వారధిగా పనిచేస్తు సమాజ అభివృద్ధికి పాత్రికేయులు పాటుపడుతున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు అన్నారు. రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ (జేఏసీ) కార్యాలయానికి వాటర్ డిస్పెన్సరీని అందించి, పాత్రికేయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలను గుర్తించి వార్త రూపంలో క్రోడీకరించి, ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకులు అవుతున్నారని పాత్రికేయులను కొనియాడారు. లయన్స్ […]