# Tags
#తెలంగాణ #జగిత్యాల

అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్  విస్తృత తనిఖీలు

జగిత్యాల

-జిల్లాలోని దమ్మన్నపేట ఆరెపెల్లి గోదావరి నది ఇసుక రీచ్ ల పరిశీలన, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు సీజ్ 

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జిల్లా లోని దమ్మన్నపేట మరియు అరెపెల్లి  గ్రామాల శివారులోని గోదావరి నది ఇసుక రీచ్ వాగులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న దమ్మన్నపేట గ్రామ శివారులోని  గోదావరి నది వద్ద జిల్లా కలెక్టర్ స్వయంగా పోలీస్ బృందాలు, రెవెన్యూ, మైనింగ్, రవాణా అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

గోదావరి నది తీరంలో అక్రమ ఇసుక రవాణాకు సిద్ధంగా ఉన్న ఇసుక లోడు తో ఉన్న 4 ట్రాక్టర్ వాహనాలను స్వయంగా  పట్టుకున్నారు.

వెంటనే ట్రాక్టర్ లను సీజ్ చేసి, కేసులు నమోదు చేయాలని కలెక్టర్ పోలీస్ శాఖ అధికారులను  ఆదేశించారు.

  అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని పట్టుకొని వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజు ఇసుక రవాణా చేస్తున్నారా ఇసుక ఎక్కడికి తరలిస్తున్నారు అని వివరాలు ఆరా తీశారు.

ఇసుక రీచ్ ల వద్ద  ఏర్పాటు చేసిన ప్రత్యెక బృందాలతో రాత్రి వేళల్లో విస్తృతంగా తనిఖీలో చేపట్టాలని అన్నారు. 

 బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట, తహసిల్దార్ , మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.