# Tags
#తెలంగాణ #జగిత్యాల

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలు…

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ :

ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్నఅంగన్వాడీ మరియు గ్రామ పంచాయతీ భవన పనులను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) నిధుల ద్వారా మంజూరైన నూతనంగా నిర్మిస్తున్నఅంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవన పనులను మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాయికల్ మండలంలోని సింగరావుపేట, శ్రీరాం నగర్, ఇటిక్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ,మరియు హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులతోపాటుగా, 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం పనులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు.

 అలాగే, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

అనంతరం, సింగరావుపేట్ లోని ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 నిర్మాణ పనులు మొదలు పెట్టని వారు ఉన్నట్లయితే వారిని వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. 

గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఎన్ని గ్రౌండ్లింగ్ వరకు వచ్చాయని ఎన్ని స్లాబ్ దశకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి సెర్ప్,  ద్వారా రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని  రవాణా కూలీల వేతనాలు మాత్రం లబ్ధిదారులు చెల్లిస్తే ఇసుక ఉచితంగా సమకూరుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, ఈఈపిఆర్ లక్ష్మణ్ రావు,జిల్లా హౌసింగ్ పిడి ప్రసాద్, ఎమ్మార్వోలు,ఎంపీడీవోలు తదితరులు  పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలు…

PolicecommemorationDay 2025