# Tags

ఎల్లో జర్నలిజం చేయవద్దు.పత్రిక స్వేచ్ఛను కలిగి ఉండండి… క్లబ్ అధ్యక్షుడు పంజ సంపత్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం రోజున మొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ మాట్లాడుతూ …పాత్రికేయ మిత్రులు ఎల్లో జర్నలిజం చేయవద్దని, సమస్యల పట్ల అందరము కలిసి ఏ సభ్యుడికి కష్టం వచ్చినా ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వ అధికారులకు,రాజకీయ నాయకులకు పత్రికా మిత్రులకు స్వేచ్ఛని ఇవ్వాలని కోరారు.వార్తల పట్ల నిష్పక్షపాతంగా నిర్భయంగా రాస్తామని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు.

TUWJ H143 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా సూచనల మేరకు ఈ క్లబ్ ముందుకు సాగుతుందని అన్నారు. పాత్రికేయ మిత్రులు స్వేచ్ఛగా వార్తలు రాయాలని,సమస్య పట్ల వార్త రాసేటప్పుడు జరిగిన సంఘటన పట్ల సంబంధిత అధికారి, లేదా నాయకుల వివరణ కోరిన తర్వాత వార్త ప్రచురణ చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పోతుల గాంధీ బాబు, ఉప అధ్యక్షులు ముద్రగోల కృష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్ల సత్యనారాయణ, ఏర్పుల నారాయణ, రమేష్, మా రేపు భూశంకర్, మిరియాలు కార్ శ్రీనివాస్, శ్రీనివాస్ నాయక్, కూరగాయల రాకేష్,బురక రాకేష్, రాజు, ఒగ్గు బాలరాజ్, పలువురు పాల్గొన్నారు…