# Tags

రాయికల్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు జిల్లా కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం

జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తా
: ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్

రాయికల్ :(సింగని శ్యాంసుందర్, తెలంగాణ రిపోర్టర్)


జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు నూతన జిల్లా కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా చీటి శ్రీనివాస్ మాట్లాడుతూ, “జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం,ఆరోగ్య కార్డులు,బీమా వంటివి అందించేందుకు కృషి చేస్తానన్నారు. జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిలా పనిచేస్తున్నారు. కానీ వారి సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావడం లేదు. వాటిని అధికారులకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను,” అని అన్నారు.రాయికల్‌కి చెందిన జర్నలిస్టులు ఐక్యతతో ఉన్నందుకు అభినందించిన ఆయన, ఇతర ప్రాంతాల్లో కూడా ఇది ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, అల్లె రాము, సంయుక్త కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి, ఇందూరి నరేష్, బూరం లక్ష్మణ్, పెరంబుదూరు శ్రీకాంత్, రాయికల్ ప్రెస్ జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్ , సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్ ,సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ ఏ.ఎం. రాజు రెడ్డి, సీనియర్ పాత్రికేయులు సింగిడి శంకర్,

ముజాఫర్, బొంగోని శ్రీనివాస్, ఎనుగంటి రవి,సింగని శ్యాంసుందర్, వాసం లింబాద్రి, జేఏసీ ప్రెస్ క్లబ్ సభ్యులు కళ్లెం శ్రీనివాస్, మాణిక్యం గంగాధర్ , అనుపురం లింబాద్రి గౌడ్ , ఇమ్మడి విజయ్ , దుగ్యల రామ్ పతి రావు, చెలిమెలమల్లేశం , బొమ్మ కంటి అనిల్ , మాలోత్ వెంకటేష్ , కొండ కళ్యాణ్ , గంట్యాల ప్రవీణ్ ,షాకీర్ , రషీద్ , ఎద్దండి జితేందర్ రెడ్డి , కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, యాచమనేని కిరణ్ రావు, సంజీవ్ , భీమ్ రాజ్ , శంకర్ , నరేష్ , లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.