# Tags

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి..మున్సిపల్ కమిషనర్ మనోహర్

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ :

ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు.

మంగళవారం రాయికల్ పట్టణంలోని 6,10,12 వార్డులలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ కు పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు.

కార్యక్రమంలో మేనేజర్ బి.వెంకటి,హౌసింగ్ ఎ.ఇ పి. తిరుమల,మున్సిపల్ సిబ్బంది రజాక్,గంగారెడ్డి, అశోక్ వార్డు కమిటీ సభ్యులు మచ్చ శేఖర్, బాపురపు రాజీవ్, నాయకులు శివ,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.