# Tags
#తెలంగాణ #జగిత్యాల

రాష్ట్రంలో మత్స్య కారులకు చేప పిల్లలకు బదులుగా, వాటి విలువను నగదు రూపకంగా పంపిణీ చేయాలి: సిఎం కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ

జగిత్యాల :

రాష్ట్రంలో మత్స్య కారులకు చేప పిల్లలకు బదులుగా, వాటి విలువను నగదు రూపకంగా పంపిణీ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంగళవారం ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖను పంపించినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం విత్తన చేప పిల్లల సేకరణకు, దాదాపు రూ.100 కోట్లతో, టెండర్ ప్రక్రియ చేపట్టకుండా, మధ్య దళారుల వ్యవస్థను తొలగింప చేసేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కారులకు చెరువులు, కుంటలలో, ప్రభుత్వ పరంగా రాయితీతో పంపిణీ చేయతలపెట్టే చేపపిల్లల స్థానే. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెరువుల నీటి నిలువ, విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొంటూ, నగదు రూపకంగా నిధులు పంపిణి చేయకలిగినచో, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు పొందే అవకాశముంతుందనీ, ఈ పరిస్థితులలో, ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచించి, తగు నిర్ణయం తీసుకోగలరని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన లేఖలో కోరారు