# Tags
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు:రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి


జగిత్యాల

  • ఎన్నికల ప్రవర్తన నియమ వాళ్ళని పకడ్బందీగా అమలు చేయాలి
  • ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఎమ్మెల్సీ ఎన్నికల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈవో

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్,అదనపు కలెక్టర్ బి ఎస్ లత తో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాద్ మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్స్ శాసన మండలి సభ్యుల స్థానానికి , ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయుల స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు , 48 గంటలు, 72 గంటలలో తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ అందించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.

శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల చేయడం జరుగుతుందని , ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్క్రూట్ ని, ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారు చేయాలని, పెండింగ్ లో ఉన్న టీచర్స్, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 7 లోపు పరిష్కరించాలని సీఈఓ అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఎంసిఎంసి కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మీడియాలలో వచ్చే ప్రసారాలను పరిశీలించాలని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం ఉండటానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ అవసరమైన వసతులు కల్పించాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసే సన్నద్ధంగా ఉండాలని అన్నారు.

ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రచారానికి అవసరమైన అనుమతులను నిబంధనలను ప్రకారం జారీ చేయాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని తెలిపారు. బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని, ఎన్ని జంబో బ్యాలెట్ నార్మల్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో సరి చూసుకోవాలని అన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రం కు ప్రిసైడింగ్ అధికారి, 3 పోలింగ్ అధికారులు ఉండే విధంగా సిబ్బందిని గుర్తించాలని అన్నారు. శాసన మండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేని మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించ వచ్చని అన్నారు. ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బందికి సర్టిఫికెట్లు జారీ చేసి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అకౌంటింగ్ బృందాలు, ఎంసిసి బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, వీ.ఎస్.టి , వీ.వి.టి మొదలగు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కలిపి 1000 దాటని చోట కామన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు.

ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని, ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు టీచర్స్ స్థానాలకు సంబంధించిన నామినేషన్ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో, ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ స్థానానికి సంబంధించిన నామినేషన్ నల్గొండ కలెక్టరేట్లో స్వీకరించడం జరుగుతుందని, దీనికి అనుగుణంగా అక్కడ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ *మాట్లాడుతూ* జగిత్యాల జిల్లాలో పట్ట భద్రులకు సంబంధించి 51 పోలింగ్ కేంద్రాల , ఉపాధ్యాయులకు సంబంధించి . ప్రస్తుతం అధికారుల వద్ద 149 పట్టభద్రులు, 20 ఉపాధ్యాయుల ఓటర్ నమోదు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని పరిశీలించి సకాలంలో డిస్పోస్ చేయడం జరుగుతుందని అన్నారు.

జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళికు సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 51 పోలింగ్ కేంద్రాలను పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు కామన్ గా ఏర్పాటు చేశామని అన్నారు. పట్టభద్రులకు ప్రత్యేకంగా 20 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత, జగిత్యాల, కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారులు మధుసూధన్, జివాకర్ రెడ్డి ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు