# Tags

NEET-2025 పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 3257 సాధించిన శ్రీతన్మయకు ‘తెలంగాణారిపోర్టర్’ శుభాకాంక్షలు

జగిత్యాల : రాయికల్ :

శుక్రవారం వెలువడిన NEET-2025 పరీక్ష ఫలితాలలో జగిత్యాలజిల్లా రాయికల్ పట్టణానికి చెందిన దాసరి శ్రీతన్మయ జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 3257 సాధించింది. ఇంటర్ BiPC లో 985 మార్కులు సాధించి మెడిసిన్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.

తల్లిదండులు దాసరి రామస్వామి, కల్పన ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, వీరి రెండవ కుమార్తె శ్రీతన్మయ వైద్య వృత్తిపై ఆసక్తితో నీట్ కు సిద్దమై జాతీయ స్థాయిలో మంచి ఫలితాన్ని సాధించింది. 

ఈ సందర్భంగా శ్రీతన్మయను PRTU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, అమర్ నాథ్ రెడ్డి, ఇతర నాయకులు పొన్నం రమేష్,  గంగారాజం, రాపర్తి నర్సయ్య, సతీష్ తదితరులు అభినందించారు.

720 మార్కులకు గాను 582 మార్కులతో 99.85 శాతం మార్కులు సాధించించింది.

శ్రీతన్మయకు ‘తెలంగాణారిపోర్టర్’ శుభాకాంక్షలు…