స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ

ప్రతి ఒక్కరి అభిప్రాయాలను నమోదు చేసుకున్నాం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- ప్రజాభిప్రాయ సేకరణకు 3 వేలకు పైగా ప్రజలు హాజరు
*ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఎన్టిపిసి :
ఎన్టిపిసి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై ప్రజలు అందించిన అభిప్రాయాలను స్వీకరించామని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నమోదు చేసి సంబంధిత శాఖకు పంపుతామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎన్టిపిసి జ్యోతి నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ, మరియు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ల రాజ్ ఠాకూర్, న్యాయవాది శశిభూషన్ కాచే తదితరులు పాల్గొన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణకి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అన్ని సంఘాల ప్రతినిధులకు, వివిధ వర్గాల ప్రజలకు ఎన్టిపిసి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై అభిప్రాయాలు తెలిపే అవకాశం కల్గింది. సుమారు 49 మందికి పైగా తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ ఓపికగా నమోదు చేసుకున్నారు. ఉదయం 11 గం. నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా 1600 మెగా వాట్ల సంబంధించి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసుకొని సరఫరా చేయడం జరుగుతుందని, ప్రస్తుతం రెండవ దశలో మిగిలిన 2400 మెగావాట్ల (800 మెగావాట్ల ×3 యూనిట్ల) ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నామని అన్నారు.
ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ గా మన రామగుండం ఆవిర్భవిస్తుందని అన్నారు. ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల జరిగే పర్యావరణ మార్పుల పై స్టడీ చేసి నివేదిక తయారు చేసారని అన్నారు.
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి వచ్చిన సందేహాలు, సూచనలు అన్ని పరిగణలోకి తీసుకొవడం జరుగుతుందని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వీడియో రికార్డింగ్ జరుగుతుందని అన్నారు. ప్రజల అందించిన అభిప్రాయాల ఆధారంగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఉంటుందని అన్నారు.
విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల వచ్చే సామాజిక ఆర్థిక పర్యావరణ మార్పులు, ఎన్టిపిసి చేపట్టే చర్యలు , ప్రాజెక్టు వివరాలను అధికారులు ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వల్ల సమీప గ్రామాలలో ఎన్టిపిసి సంస్థ సిఎస్ఆర్ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సైతం వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని సంబంధించి అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ అధికారి బిక్షపతి, రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, సెంట్రల్ ఎన్.బి.సి సభ్యులు బాబర్ సలీం పాషా, తెలంగాణ ప్రాజెక్టు హెడ్ చందన్ కుమార్ సమంత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యా సంస్థల ప్రతినిధులు పర్యావరణవేత్తలు సామాజిక వర్కర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సమీప గ్రామాలలోని ప్రజలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.